బ్రేకింగ్ : హైదరాబాద్ లో మరో భారీ కుంభకోణం

హైదరాబాద్ లో మరో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 300 కోట్ల విలులైన నాలుగు ఎకరాల స్థలాన్ని ఆక్రమించారని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు [more]

Update: 2020-09-17 13:56 GMT

హైదరాబాద్ లో మరో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 300 కోట్ల విలులైన నాలుగు ఎకరాల స్థలాన్ని ఆక్రమించారని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్జరీ పత్రాలతో ఈ భూకుంభకోణానికి పాల్పడ్డారని ఫిిర్యాదు అందింది. బంజరా హిల్స్ రోడ్ నెంబరు 12లో 2.21 కుంటల ఎకరాలను కొనుగోలు చేసి నాలుగున్నర ఎకరాలకు ఫోర్జరీ డాక్యుమెంట్లతో సొంతంచేసుకున్నారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బాధితుడు శ్రీధర్ ఫిర్యాదు చేశారు. భవన నిర్మాణానికి కూడా అనుమతులు తీసుకున్నారని బాధితుడు శ్రీధర్ ప్రసాద్ ఆరోపిస్తున్నారు. దీనిపై నజీబ్ అహ్మద్ తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News