దిశ ఎన్ కౌంటర్ పై మరికాసేపట్లో?

దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై దాఖలైన అన్ని పిటిషన్ ఈరోజు మధ్యాహ్నం విచారిస్తామని హైకోర్టు తెలిపింది ఇప్పటికే దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై [more]

Update: 2019-12-09 06:26 GMT

దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై దాఖలైన అన్ని పిటిషన్ ఈరోజు మధ్యాహ్నం విచారిస్తామని హైకోర్టు తెలిపింది ఇప్పటికే దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ జరపాలంటూ మహిళా సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి‌. దీంతో పాటుగా బంధుమిత్రులకు మృతదేహాలను అప్పగించాలంటూ పిటిషన్ దాఖలైందిజ దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ మరొక్క పిటిషన్ వేశారు వీటన్నిటికీ కలిపి ఇవాళ మధ్యాహ్నం విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. మరో వైపు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ప్రస్తావన వచ్చింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనర్ జిఎస్ మణి కోరారు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఈ అంశాన్ని విచారిస్తుందని సీజే బాబ్డే గుర్తు చేశారు. ఎన్ కౌంటర్ బూటకం, సుప్రీం ఆదేశాలు పాటించలేదని పిటిషనర్ తెలిపారు.

Tags:    

Similar News