కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్ లో వివరాలు సరిగ్గా ఇవ్వలేదని గజ్వేల్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కేసీఆర్ [more]

Update: 2019-03-26 12:50 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్ లో వివరాలు సరిగ్గా ఇవ్వలేదని గజ్వేల్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కేసీఆర్ పై హైకోర్టులో పిటీషన్ వేశారు. కేసీఆర్ పై 64 కేసులు ఉండగా అఫిడవిట్ లో కేవలం నాలుగు కేసులే ఉన్నట్లు చెప్పారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని ఆయన పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు కేసీఆర్ ను నోటీసులు జారీ చేసి ఈ కేసు విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.

Tags:    

Similar News