ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ పై తీర్పు రిజర్వ్

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు దీనిపై విచారణ హైకోర్టులో జరిగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు [more]

Update: 2021-08-05 12:56 GMT

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు దీనిపై విచారణ హైకోర్టులో జరిగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా నిర్వహించారని టీడీపీ నేత వర్ల రామయ్య, జనసేన నుంచి మరో నేత పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి తో కూడిన బెంచ్ ఎన్నికల కౌంటింగ్ పై స్టే విధించింది. సింగిల్ జడ్జిఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించారు. నిబంధనల ప్రకారమే ఎన్నికలను నిర్వహించామని హైకోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న డివిజనల్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది.

Tags:    

Similar News