అక్కడ కూడా ఇక లాక్ డౌన్

దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతుంది. దీంతో ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా జార్ఖండ్ లో లాక్ డౌన్ [more]

Update: 2021-04-21 01:30 GMT

దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతుంది. దీంతో ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా జార్ఖండ్ లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. ఈ నెల 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ లాక్ డౌన్ అమలులో ఉండనుంది. అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు. ఐదుగురికి మించి ఎక్కడా సమావేశం కాకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News