కరోనా నియంత్రణపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. నిన్న హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులపై విచారణ జరిగింది. ఆక్సిజన్ నిల్వలు సరిపడా ఉన్నాయా? [more]

Update: 2021-04-28 00:50 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. నిన్న హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులపై విచారణ జరిగింది. ఆక్సిజన్ నిల్వలు సరిపడా ఉన్నాయా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పుడున్న ఆక్సిజన్ నిల్వలు ఎంతకాలం సరిపోతాయని, ఎన్ని ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేశారని, టెస్టుల సంఖ్య ను ఎంత పెంచారని హైకోర్టు ప్రశ్నించింది. ఏపీ లిబర్టీ అసోసియేషన్ ఈ పిటీషన్లు వేసింది. విచారణను నేడు మరోసారి హైకోర్టు చేపట్టనుంది.

Tags:    

Similar News