హజీపూర్ హత్యల కేసులో వీడిన మిస్టరీ

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్ గ్రామంలో జరిగిని ముగ్గురు బాలికల హత్యల మిస్టరీ వీడింది. ఇవాళ రాచకొండ పోలీస్ కమిషర్ మహేష్ భగవత్ ఈ [more]

Update: 2019-04-30 14:10 GMT

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్ గ్రామంలో జరిగిని ముగ్గురు బాలికల హత్యల మిస్టరీ వీడింది. ఇవాళ రాచకొండ పోలీస్ కమిషర్ మహేష్ భగవత్ ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్ రెడ్డి అనే సైకో కిల్లర్ ఈ మూడు హత్యలకూ పాల్పడ్డాడని తెలిపారు. ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసి పాత బావుల్లో పూడ్చిపెట్టాడని పేర్కొన్నారు. 2015లో కల్పన అనే 11 ఏళ్ల బాలిక కల్పనను బండిపై ఎక్కించుకొని తీసుకువెళ్లి హత్య చేశాడని తెలిపారు. రెండు నెలల క్రితం మనీష అనే డిగ్రీ ద్వితీయ సంవత్సరం బాలికను లిఫ్ట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడని తెలిపారు. చివరిగా శ్రావణిని వారం క్రితం లిఫ్ట్ ఇచ్చి తీసుకెళ్లి చంపాడని పేర్కొన్నారు. శ్రావణి, మనీషా మృతదేహాలు వెలికితీశామని, నాలుగేళ్ల క్రితం హత్యకు గురైన కల్పన మృతదేహం కోసం వెతుకుతున్నామని తెలిపారు. అంతకుముందు కూడా కర్నూలులో ఓ వేశ్యను శ్రీనివాస్ మరో నలుగురితో కలిసి హత్య చేశాడని తెలిపారు. శ్రీనివాస్ ఇంతకుముందు పనిచేసిన, నివసించిన ప్రాంతాల్లో ఇటువంటి వాటికి పాల్పడ్డాడా అనేది కూడా ధర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tags:    

Similar News