మరోసారి చెప్పేసిన జీవీఎల్

రాజధాని అమరావతి అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని తరలింపు విషయంలో జోక్యం చేసుకోదని [more]

Update: 2020-03-06 02:30 GMT

రాజధాని అమరావతి అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని తరలింపు విషయంలో జోక్యం చేసుకోదని మరోసారి తెలిపారు. రాష్ట్ర బీజేపీ తీర్మానం చేసిన వాటిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన పనిలేదని కూడా జీవీఎల్ చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఈ విషయంపై స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయమని బీజేపీ రాష్ట్ర పార్టీ కోరితే ఆ పని కేంద్ర ప్రభుత్వం చేస్తుందా? అని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి సయితం వేసవి రాజధానిని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా జీవీఎల్ గుర్తు చేశారు. తాను మాట్లాడే ప్రతి మాట కేంద్ర నాయకత్వం అనుమతితోనే మాట్లాడతానని జీవీఎల్ చెప్పారు.

Tags:    

Similar News