మండిపడిన జీవీఎల్ ఆ పాపం చంద్రబాబుదే

మద్యం అమ్మకాలను ఏపీలో విస్తృతం చేసింది చంద్రబాబు మాత్రమేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. మూడు వేల కోట్లు ఉన్న ఎక్సైజ్ ఆదాయాన్ని ఆరు [more]

Update: 2020-05-06 12:59 GMT

మద్యం అమ్మకాలను ఏపీలో విస్తృతం చేసింది చంద్రబాబు మాత్రమేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. మూడు వేల కోట్లు ఉన్న ఎక్సైజ్ ఆదాయాన్ని ఆరు వేలు కోట్లు చంద్రబాబేనని అన్నారు. వైసీపీ, టీడీపీలు రెండూ మద్యం విషయంలో ఒక్కటేలా వ్యవహరించాయని జీవీఎల్ చెప్పారు. రాష్ట్రాలన్నీ మద్యం దుకాణాలు తెరవాలని కేంద్రంపై వత్తిడి తెచ్చాయని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లోనే కేంద్ర ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. మద్యం దుకాణాల ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్రాలకు మాత్రమే వస్తుందన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.

Tags:    

Similar News