వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ జీవీఎల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతల అక్రమ అరెస్ట్ లను ఆయన ఖండించారు. దేవాలయాలపై జరుగుతున్న [more]

Update: 2020-09-18 06:09 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతల అక్రమ అరెస్ట్ లను ఆయన ఖండించారు. దేవాలయాలపై జరుగుతున్న వరస దాడులు, ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడాన్ని జీవీఎల్ నరసింహారావు తప్పుపట్టారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వివక్షతతో వ్యవహరస్తుందన్నారు. అన్ని దేవాలయాల్లో చటు చేసుకున్న సంఘటనలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. దుర్గగుడిలో చంద్రబాబు హయాంలోనే క్షుద్రపూజలు జరిగాయని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అక్రమంగా అరెస్ట్ చేసిన బీజేపీ నేతలందరినీ విడుదల చేయాలని కోరారు.

Tags:    

Similar News