మాదే గెలుపు.. ఇందుకు నిదర్శనమిదే

తిరుపతిని అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీయేనని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఇందుకు ఎవరితోనైనా చర్చకు సిద్ధమని జీవీఎల్ సవాల్ విసిరారు. 1999లో తమ [more]

Update: 2021-03-30 01:02 GMT

తిరుపతిని అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీయేనని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఇందుకు ఎవరితోనైనా చర్చకు సిద్ధమని జీవీఎల్ సవాల్ విసిరారు. 1999లో తమ పార్టీ తిరుపతిలో గెలిచిన విషయాన్ని జీవీఎల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామన్నారు. టీడీపీ, వైసీపీ హయాంలో అభివృద్ధి అనేది ఏమీ లేదని జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ప్రజలను మభ్యపెట్టి వైసీపీ బెదిరింపులు, డబ్బులతో రాజకీయాలు చేస్తుందని జీవీఎల్ నరసింహారావు అన్నారు.

Tags:    

Similar News