వైసీపీకి పదిరోజులు సమయమిచ్చిన జీవీఎల్

పదిరోజుల్లోగా ఆలయాలపై దాడులు చేసిన వారిని పట్టుకోకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఆలయాలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. [more]

Update: 2021-01-08 08:04 GMT

పదిరోజుల్లోగా ఆలయాలపై దాడులు చేసిన వారిని పట్టుకోకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఆలయాలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కూలగొట్టిన ఆలయాలకు శంకుస్థాపన చేసినంత మాత్రాన హిందువులను ఉద్ధరించినట్లు కాదని జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో 140 ఆలయాల్లో దాడులు జరిగాయన్నారు. ఎక్కడా నిందితులను పట్టుకోలేదన్నారు. టీడీపీ కూడా వీటిపై దుష్ప్రచారం చేస్తుందని జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు.

Tags:    

Similar News