నెలకు 75 లక్షల దోపిడీకి అచ్చెన్న ప్లాన్ అట

నెలకు 75 లక్షల రూపాయలు దోపిడీ చేనేందుకే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ చేశారని మంత్రి గుమ్మనూరి జయరాం అన్నారు. తాను కూడా బీసీనేనని, బీసీని [more]

Update: 2020-02-21 12:57 GMT

నెలకు 75 లక్షల రూపాయలు దోపిడీ చేనేందుకే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ చేశారని మంత్రి గుమ్మనూరి జయరాం అన్నారు. తాను కూడా బీసీనేనని, బీసీని తాను ఎందుకు టార్గెట్ చేస్తానని జయరాం చెప్పుకొచ్చారు. బీసీ అయితే అవినీతి చేయొచ్చా అని జయరాం ప్రశ్నించారు. ఈఎస్ఐలో భారీ స్కాం జరిగిందని మంత్రి జయరామ్ తెలిపారు. చేయకుంటే సస్పెండ్ చేస్తామని ఉద్యోగులను అప్పటి మంత్రులు బెదిరించారన్నారు. తెలంగాణా ఈఎస్ఐ స్కాంలో బయటపడ్డ కంపెనీలే ఏపీలో కకూడా ఉన్నాయని చెప్పారు. ఈ స్కామ్ లో ఎవరినీ వదలిపెట్టేది లేదని గుమ్మనూరి జయరాం తెలిపారు. అచ్చెన్న తోపాటు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ టైంలో కూడా స్కామ్ జరిగిందని జయరాం తెలిపారు. ప్రధాని మెరుగైన సేవలు అందించమని చెబుతారు కాని స్కాములు చేయమని చెబుతారా? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News