జగన్ సెంచరీలు కొట్టాలి

వైఎస్ జగన్ టీం కెప్టెన్ గా సెంచరీలు చేయాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. పవర్ ప్లేలోనే ఎక్కువ పరుగులు సాధించిన జగన్ నిలకడగా ఆడుతూ నాట్ అవుట్ [more]

Update: 2019-07-22 14:48 GMT

వైఎస్ జగన్ టీం కెప్టెన్ గా సెంచరీలు చేయాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. పవర్ ప్లేలోనే ఎక్కువ పరుగులు సాధించిన జగన్ నిలకడగా ఆడుతూ నాట్ అవుట్ గా నిలబడాలని గవర్నర్ కోరారు. గవర్నర్ నరసింహన్ వీడ్కోలు సందర్భంగా విజయవాడ గేట్ వే హోటల్ లో జరిగిన విందు కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ దంపతులతో పాటు వైఎస్ జగన్ దంపతులు, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయని గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే పద్ధతిలో సమావేశాలు నడపాలని కోరారు. తాను తెలిసి, తెలియక ఏవైనా తప్పుతు చేసి ఉంటే క్షమించాలని గవర్నర్ నరసింహన్ కోరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గవర్నర్ నరసింహన్ కు వీడ్కోలు పలకడం బాధాకరంగానే ఉన్నా పక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటారన్న ఆనందం ఉందన్నారు. తండ్రిలాగా నరసింహన్ తనను చేయి పట్టుకుని నడిపించారన్నారు.

Tags:    

Similar News