పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టుకు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కట్టడి చేస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం కోర్టుకు వెళ్లే యోచనలో ఉంది. హైకోర్టుకు నేడు, రేపు సెలవులు కావడంతో [more]

Update: 2021-02-06 08:59 GMT

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కట్టడి చేస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం కోర్టుకు వెళ్లే యోచనలో ఉంది. హైకోర్టుకు నేడు, రేపు సెలవులు కావడంతో హౌస్ మోషన్ పిటీషన్ వేయాలని భావిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈనెల 21వ తేదీ వరకూ ఇంటి నుంచి బయటకు రావద్దంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే నిబంధనలకు వ్యతిరేకంగా ఇచ్చిన నిమ్మగడ్డ ఉత్తర్వులపై ప్రభుత్వంపై హైకోర్టుకు వెళ్లనుంది.

Tags:    

Similar News