జగన్ మరో కీలక నిర్ణయం

రాష్ట్రంలో మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 33 శాతం మద్యం షాపులు తొలగిస్తూ జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 4380 [more]

Update: 2020-05-09 12:55 GMT

రాష్ట్రంలో మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 33 శాతం మద్యం షాపులు తొలగిస్తూ జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 4380 మద్యం షాపులను గతంలో 3500 కి తగ్గించిన ప్రభుత్వం తాజాగా షాపుల సంఖ్యను 2934 కి తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరు నాటికి షాపులు తొలగించాలని ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 43 వేల బెల్టు షాపులు ప్రభుత్వం తొలగించింది. 40 శాతం బార్లు తగ్గిస్తూ గతంలోనే నిర్ణయం తీసుకుంది. దశలవారి మద్యపాన నిషేధం లో భాగంగా ఈ కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.

Tags:    

Similar News