ఆలయాలపై జరిగిన ఘటనలో 13 మంది టీడీపీ నేతలే

దేవాలయాల దాడులపై కొందరిని అరెస్ట్ చేశామని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. తొమ్మిది కేసుల్లో రాజకీయ నేతల ప్రమేయమున్నట్లు గుర్తించామని చెప్పారు. 13 మంది టీడీపీ, ఇద్దరు [more]

Update: 2021-01-15 12:50 GMT

దేవాలయాల దాడులపై కొందరిని అరెస్ట్ చేశామని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. తొమ్మిది కేసుల్లో రాజకీయ నేతల ప్రమేయమున్నట్లు గుర్తించామని చెప్పారు. 13 మంది టీడీపీ, ఇద్దరు బీజేపీ నేతల ప్రమేయం ఉందని డీజీప వెల్లడించారు. ప్రణాళిక ప్రకారమే దేవాలయ దాడులపై అసత్య ప్రచారం జరుగుతుందన్నారు. వీరిపై కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ తెలిపారు. మతాల మధ్య వైషమ్యాల సృష్టించే వారిని వదిలపెట్టబోమని తెలిపారు. పదిహేను మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. దేవాలయాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాల్లోనూ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News