గొట్టిపాటికి గట్టి షాక్

టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. గొట్టి పాటి రవికుమార్ కు చెందిన మైనింగ్ లీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం [more]

Update: 2020-08-25 05:44 GMT

టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. గొట్టి పాటి రవికుమార్ కు చెందిన మైనింగ్ లీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గొట్టి పాటి రవికుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన గనుల లీజును కూడా ప్రభుత్వం రద్దు చేసింది. మైనింగ్ లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో మైనింగ్ లీజులను రద్దు చేసింది. గొట్టి పాటి రవికుమార్ కు చెందిన ఐదు, ఆయన సన్నిహితులకు చెందిన నాలుగు, పోతుల రామారావుకు చెందిన ఒక గనుల లీజును ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లీజు ఉత్తర్వులు చూసిన తర్వాత వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్న ఉద్దేశ్యంలో ఉన్నారు.

Tags:    

Similar News