బ్రేకింగ్: గోరంట్ల మాధవ్ కు భారీ ఊరట

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు భారీ ఊరట లభించింది. ఆయనకు వీఆర్ఎస్ ఇవ్వాలని ట్రైబ్యునల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ [more]

Update: 2019-03-20 11:48 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు భారీ ఊరట లభించింది. ఆయనకు వీఆర్ఎస్ ఇవ్వాలని ట్రైబ్యునల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనను రిలీవ్ చేయాలని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ రెండున్నర నెలల క్రితం వీఆర్ఎస్ ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనకు జగన్ ఎంపీ టిక్కెట్ ప్రకటించారు. అయితే, ఆయనకు వీఆర్ఎస్ ఇవ్వకుండా ప్రభుత్వం ఆపింది. ఆయన నామినేషన్ వేసినా చెల్లని పరిస్థితి ఏర్పడింది. దీంతో గోరంట్ల మాధవ్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించగా ఆయనకు వెంటనే వీఆర్ఎస్ ఇవ్వాలనే ఆదేశాలు వచ్చాయి. దీంతో గోరంట్ల మాధవ్ పోటీ చేయడానికి లైన్ క్లీయర్ అయ్యింది.

Tags:    

Similar News