గ్యాంగ్ రేప్ ఉత్తుత్తిదే… పోలీసులు తేల్చేశారు

హైదరాబాదులో అమ్మాయి కిడ్నాప్ ఆపై సామూహిక అత్యాచారం కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి కొత్త విషయాలను రాచకొండ కమిషనర్ బయటపెట్టారు. అసలు గ్యాంగ్ [more]

Update: 2021-02-14 01:19 GMT

హైదరాబాదులో అమ్మాయి కిడ్నాప్ ఆపై సామూహిక అత్యాచారం కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి కొత్త విషయాలను రాచకొండ కమిషనర్ బయటపెట్టారు. అసలు గ్యాంగ్ రేప్ జరిగనప్పటికీ, అమ్మాయి పోలీసులతో పాటు తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించిందని తెలిపారు. దీంతో పాటు కిడ్నాపులు అనే కథ తనకు కిక్ ఇస్తుందని , అందుకోసమే తప్పుడు కథనాలు చెప్పి అందరిని మిస్ గైడ్ చేసిందని పోలీసులు తెలిపారు. నాలుగు రోజులపాటు గ్యాంగ్ రేప్ నిందితులకు పట్టుకోవడానికి పోలీసుల 40 మందిని సైతం విచారించారు . అయితే ఒక ఆటో డ్రైవర్ తో గతంలో ఉన్న గొడవ కారణంగా అతని తో పాటు అతని ఫ్రెండ్స్ పేర్లు చెప్పి అమ్మాయి పోలీసులకు సైతం తప్పుదారి పట్టించింది . అంతేకాకుండా తనకు పై సామూహిక అత్యాచారం చేశారని తెలిపింది. ఇవన్నీ బోగస్ అని పోలీసుల విచారణలో బయట పడింది. దీంతో అమ్మాయి పైన చర్యలు తీసుకున్నారు.

Tags:    

Similar News