ఈరోజు ఈడీ ముందుకు పూరీజగన్నాధ్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అనుమానితులను నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించనుంది. మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తుంది. ఈరోజు నుంచి సెప్టంబరు నెలాఖరు వరకూ టాలివుడ్ [more]

Update: 2021-08-31 02:58 GMT

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అనుమానితులను నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించనుంది. మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తుంది. ఈరోజు నుంచి సెప్టంబరు నెలాఖరు వరకూ టాలివుడ్ నటీనటులు, డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈరోజు డైరెక్టర్ పూరీ జగన్నాధ్ హాజరుకానున్నారు. డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితుల నుంచి ఈడీ స్టేట్ మెంట్స్ రికార్డు చేసింది. అప్పట్లో ఈ కేసును విచారించిన ఎక్సైజ్ అధికారుల ను కూడా విచారించింది. వారి నుంచి నివేదిక తీసుకుంది. నేటి నుంచి ఈడీ విచారణ ప్రారంభం కానుండటంతో టాలీవుడ్ లో ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News