ఏబీ వెంకటేశ్వరరావుపై డీఐజీ ఫైర్

ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పై డీఐజీ పాల్ రాజు ఫైర్ అయ్యారు. ఏబీ వెంకటేశ్వరరావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు [more]

Update: 2021-04-19 00:50 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పై డీఐజీ పాల్ రాజు ఫైర్ అయ్యారు. ఏబీ వెంకటేశ్వరరావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అంతా ఆయనే పర్యవేక్షించారన్నారు. వైఎస్ కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయాలని అప్పట్లో పోలీసు అధికారలుపై ఏబీవీ వత్తిడి తెచ్చారని పాల్ రాజు చెప్పారు. సీబీఐకి రాసిన లేఖ బహిర్గతం చేయడంతోనే ఆయన ఇన్ టెన్షన్ అర్ధమవుతుందన్నారు. తప్పుడు సాక్షాధారాలను తనపై సృష్టించారన్న ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యల్లో నిజం లేదని పాల్ రాజు తెలిపారు

Tags:    

Similar News