మేయర్ తొలి నిర్ణయమే వైరల్

హైదరాబాద్ మేయర్ గా విజయ లక్ష్మి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. [more]

Update: 2021-03-06 01:07 GMT

హైదరాబాద్ మేయర్ గా విజయ లక్ష్మి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యుత్ అంతరాయం కలుగకుండా తన క్యాంప్ ఆఫీస్‌లో వెంటనే 25 కేవీ జనరేటర్‌ను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను మేయర్ విజయలక్ష్మి కోరారు. తన క్యాంప్ ఆఫీస్‌లో తరచుగా విద్యుత్ అంతరాయం కల్గడంపై మేయర్ విజయలక్ష్మి ఆరా తీశారు. విద్యుత్ అంతరాయం పై జీహెచ్ఎంసీ కమిషనర్‌కు మేయర్ విజయలక్ష్మి ఫైల్ పంపారు. విద్యుత్ అంతరాయంతో తన క్యాంప్ ఆఫీస్‌లో రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందని దానిలో వెల్లడించారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా తన క్యాంప్ ఆఫీస్‌లో 25 కేవీ జనరేటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను మేయర్ కోరారు. హైదరాబాద్ నగరంలో చాలా వరకు విద్యుత్ కోతలు ఎక్కడ కూడా ఉండట్లేదు. కానీ మేయర్ క్యాంపు కార్యాలయంలో నిత్యం విద్యుత్ కోతలు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అయితే దీనిపై కమిషనర్ ఏవిధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News