బ్రేకింగ్ : బెజవాడలో తొలి కరోనా మరణం

ఆంధ్రప్రదేశ్ లో తొలి కరోనా మరణం సంభవించింది. ఇప్పటి వరకూ 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినా మరణాలు లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. అయితే [more]

Update: 2020-04-03 07:50 GMT

ఆంధ్రప్రదేశ్ లో తొలి కరోనా మరణం సంభవించింది. ఇప్పటి వరకూ 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినా మరణాలు లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. అయితే బెజవాడలోని కుమ్మరిపాలెంకు చెందిన షేకు సుభాని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారన్నారు. ఆయనకు గుండె సంబంధిత వ్యాధి, బీపీతో బాధపడుతున్నారని, ఆసుపత్రికి తీసుకు వచ్చి, పరీక్షలు చేస్తున్న సమయంలోనే మరణించారు. షేక్ సుభాని కుమారుడు ఈనెల 17వ తేదీన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. అతడికి కరోనా పాజటివ్ సోకింది. కుమారుడి వల్లనే షేక్ సుభానికి కూడా కరోనా సోకింది. దీంతో ఆయన మృతి చెందారు. ఏపీ ప్రభుత్వం కూడా కరోనా కారణంగా సుభానీ మరణించారని అధికారికంగా ప్రకటించింది.

Tags:    

Similar News