జామియాలో కాల్పుల కలకలం

ఢిల్లీలో కాల్పులు కలకలం జరిగింది. ఢిల్లీలోని జామియా యూనివర్సిటీ విద్యార్థులు పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ర్యాలీని చేయాలని నిర్ణయించారు. యూనివర్సిటీ నుంచి రాజ్ ఘాట్ వరకూ [more]

Update: 2020-01-30 08:55 GMT

ఢిల్లీలో కాల్పులు కలకలం జరిగింది. ఢిల్లీలోని జామియా యూనివర్సిటీ విద్యార్థులు పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ర్యాలీని చేయాలని నిర్ణయించారు. యూనివర్సిటీ నుంచి రాజ్ ఘాట్ వరకూ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ర్యాలీ ప్రారంభమయిన కొద్దిసేపటికే ఒక దుండగుడు జామియా యూనివర్సిటీ విద్యార్థులపై కాల్పులు జరిపాడు. రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపాడు. మరో రెండు రౌండ్లు విద్యార్థులపైకి జరపగా ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా గత కొంతకాలం నుంచి జామియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News