రాజును అరెస్ట్ చేసింది అందుకే

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును అమరావతికి అనుకూలంగా మాట్లాడారనే అరెస్ట్ చేశారని రైతులు ఆరోపించారు. అమరావతి ఉద్యమానికి ఆయన అండగా ఉన్నారన్న కోపంతోనే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ [more]

Update: 2021-05-16 01:11 GMT

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును అమరావతికి అనుకూలంగా మాట్లాడారనే అరెస్ట్ చేశారని రైతులు ఆరోపించారు. అమరావతి ఉద్యమానికి ఆయన అండగా ఉన్నారన్న కోపంతోనే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని రైతులు అన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలుకావడం లేదని వారు అభిప్రాయపడ్డారు. రఘురామకృష్ణంరాజుకంటే దారుణంగా మాట్లాడిని తమ్మినేని సీతారాం, కొడాలి నానిలపై ఏం చర్యలు తీసుకున్నారని అమరావతి రైతులు ప్రశ్నించారు. తమప్రాంతంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం కావాలనే తూతూ మంత్రంగా నిర్వహిస్తుందని వారు పేర్కొన్నారు.

Tags:    

Similar News