600వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళన

అమరావతి రాజధాని రైతుల ఆందోళన 600వ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా రైతులు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ చేస్తున్న ఆందోళనను ఈ రోజు [more]

Update: 2021-08-08 01:30 GMT

అమరావతి రాజధాని రైతుల ఆందోళన 600వ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా రైతులు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ చేస్తున్న ఆందోళనను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిబింబించేలా కార్యక్రమాలను తీసుకున్నారు. ఇందుకు పెద్దయెత్తున ర్యాలీ చేయాలని నిర్ణయించారు. కానీ పోలీసులు ఇందుకు అనుమతి ఇవ్వలేదు. కోవిడ్ నిబంధనలను అమలులో ఉన్నందున ఎటుంటి ర్యాలీలకు అనుమతి లేదని, యాభై మందికంటే ఎక్కువగా పాల్గొనటానికి వీలు లేదని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News