‌Hyderabad : రెండు కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం

హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ గుట్టు బయటపడింది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కోట్ల రూపాయల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు [more]

Update: 2021-11-09 03:27 GMT

హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ గుట్టు బయటపడింది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కోట్ల రూపాయల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రూ. 500లు, రూ.2,000ల నకిలీ నోట్లను ముద్రించి చలామణికి సిద్ధంగా ఉంచిన నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సమాచారం మేరకు….

అందిన సమాచారం మేరకు దొంగనోట్ల ముఠాను గోల్కొండ పోలీసులు పట్టుకున్నారు. సెవెన్ టూంబ్స్ బస్టాండ్ సమీపంలో ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వీరిని విచారిస్తున్నారు. ఎక్కడ ముద్రించారు? ఎవరికి సరఫరా చేస్తున్నారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News