బ్రేకింగ్: రాజస్థాన్ రాయల్స్ ఎవరంటే...? టైమ్స్ నౌ సర్వే

Update: 2018-12-07 12:25 GMT

రాజస్థాన్ కాంగ్రెస్ దే నని టైమ్స్ నౌ సర్వే తేల్చింది. వసుంధర రాజే ప్రభుత్వం తిరగి రావడం కష్టమేనని తేల్చింది. టైమ్స్ నౌ సర్వేలో బీజేపీకి 85 స్థానాలు, కాంగ్రెస్ 105 స్థానాలు, బీఎస్పీ 2, ఇతరులు ఏడు స్థానాలను కైవసం చేసుకుంటారని టైమ్స్ నౌ సర్వే తేల్చింది. రాజస్థాన్ లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాజస్థాన్ లో ఒక సారి అధికారంలో ఉన్న ప్రభుత్వం తిరిగి రావడం కష్టమే. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాజస్థాన్ ఓటర్లు తీర్పు చెప్పారని టైమ్స్ నౌ తేల్చింది. వసుంధర దిగిపోక తప్పదని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ తరుపున సచిన్ పైలెట్, అశోక్ గెహ్లెట్ లు సారధులుగా ఉన్నారు.

Similar News