టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లాలోని పోతుల రామారావు కు చెందిన మైనింగ్ లీజులు రద్దు చేస్తూ [more]

Update: 2020-08-27 14:15 GMT

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లాలోని పోతుల రామారావు కు చెందిన మైనింగ్ లీజులు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై పోతుల రామారావు హైకోర్టును ఆశ్రయించారు. మైనింగ్ లీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో పోతుల రామారావుకు హైకోర్టు ఊరట లభించింది.

Tags:    

Similar News