వైసీపీలో చేరనున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరనున్నారు. రేపు జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు. పంచకర్ల రమేష్ బాబు కొంతకాలం క్రితం [more]

Update: 2020-08-27 05:18 GMT

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరనున్నారు. రేపు జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు. పంచకర్ల రమేష్ బాబు కొంతకాలం క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడిగా పేరుంది. ఆయన వైసీపీ చేరికకు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్దమయ్యారు. పంచకర్ల రమేష్ బాబు చేరికతో విశాఖ జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News