టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జనార్థన్ థాట్రాజ్ మృతి చెందారు. ఆయన గుండెపోటుతో చనిపోయారు. జనార్థన్ థాట్రాజ్ గత ఎన్నికల్లోనూ కురుపాం నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ [more]

Update: 2020-07-21 03:10 GMT

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జనార్థన్ థాట్రాజ్ మృతి చెందారు. ఆయన గుండెపోటుతో చనిపోయారు. జనార్థన్ థాట్రాజ్ గత ఎన్నికల్లోనూ కురుపాం నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే కుల సర్టిఫికేట్ కారణంగా ఆయన నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. జనార్థన్ థాట్రాజ్ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మేనల్లుడు. గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందారు.

Tags:    

Similar News