టీడీపీ మాజీ ఎమ్మెల్యే కు కరోనా

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. బీసీ జనార్థన్ రెడ్డి హైదరాబాద్ లోని రెండు ప్రయివేటు ఆసుపత్రుల్లో టెస్ట్ [more]

Update: 2020-07-19 06:40 GMT

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. బీసీ జనార్థన్ రెడ్డి హైదరాబాద్ లోని రెండు ప్రయివేటు ఆసుపత్రుల్లో టెస్ట్ చేయించుకున్నారు. ఒక ఆసుపత్రిలో నెగిటివ్ రాగా, మరొక ఆసుపత్రిలో పాజిటివ్ గా వచ్చింది. దీంతో బీసీ జనార్థన్ రెడ్డి హోం క్వారంటైన్ కు వెళ్లారు. తన ఆరోగ్యం పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తనను ఐదు రోజుల నుంచి కలసిన వారందరూ టెస్ట్ లు చేయించుకోవాలని బీసీ జనార్థన్ రెడ్డి కోరారు.

Tags:    

Similar News