ఈటలకు బీజేపీ నేతల పరామర్శ

అస్వస్థతకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను బీజేపీ నేతలు పరామర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావులు పరామర్శించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న [more]

Update: 2021-08-01 05:53 GMT

అస్వస్థతకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను బీజేపీ నేతలు పరామర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావులు పరామర్శించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈటల రాజేందర్ ఆరోగ్య పరిస్థితి గురించి వారు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈటల రాజేందర్ ఆరోగ్యం మెరుగుపడిందని, త్వరలోనే ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపడతారని రాజాసింగ్ తెలిపారు. ఈటల రాజేందర్ రేపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.

Tags:    

Similar News