కిషన్ రెడ్డి మంత్రి అయ్యారంటే సంతోషించాం.. కానీ?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయిన తర్వాత తాము సంతోషించామన్నారు. కానీ కేంద్ర [more]

Update: 2021-08-21 05:54 GMT

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయిన తర్వాత తాము సంతోషించామన్నారు. కానీ కేంద్ర మంత్రి అయిన తర్వాత తెలంగాణకు నిధులు తేవడంలో విఫలమయ్యారన్నారు. కేంద్రమంత్రిగా తెలంగాణకు నిధులు తెస్తారనుకుంటే, ఉత్తచేతులతో వచ్చారన్నారు. ఏడేళ్లుగా బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గిరిజన యూనివర్సిటీకి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆయన విమర్శించారు. బీజేపీ తెలంగాణకు సాయం చేయడానికి సిద్ధంగా లేదన్న విషయం అర్థమయిందన్నారు.

Tags:    

Similar News