బ్రేకింగ్ : ప్రాజెక్టులపై కమిటీలు

మేజర్ ప్రాజెక్టులపై కమిటీలు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల ప్రాజెక్టు శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో రింగ్ గా ఏర్పడి [more]

Update: 2019-07-17 04:33 GMT

మేజర్ ప్రాజెక్టులపై కమిటీలు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల ప్రాజెక్టు శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో రింగ్ గా ఏర్పడి ప్రాజెక్టు కాంట్రాక్టులు చేపట్టారన్నారు. ఒక్కో మేజర్ ప్రాజెక్టుకు రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయలు అంచనా వ్యయాన్ని పెంచారని ఆయన తెలిపారు. ప్రాజెక్టుల వారీగా కమిటీలు వేస్తున్నామని, ఆ కమిటీల నివేదిక వచ్చిన తర్వాత రీ టెండర్లు పిలుస్తామని శాసనసభలో అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 60 వేల కోట్ల దోపిడీ జరిగిందన్నారు. టీడీపీ హయాంలో ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేశారని, ఆ వృధా సొమ్ముతో ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు.

Tags:    

Similar News