మైదుకూరు లో టాస్ వేయాల్సిందేనా…? తేలిపోతుందా?

మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇక్కడ అధికార వైసీపీకి కొంత అనుకూలంగా పరిస్థితులు కన్పిస్తున్నాయి. మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా 11 చోట్ల [more]

Update: 2021-03-18 01:03 GMT

మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇక్కడ అధికార వైసీపీకి కొంత అనుకూలంగా పరిస్థితులు కన్పిస్తున్నాయి. మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా 11 చోట్ల వైసీపీ, 12 చోట్ల టీడీపీ, ఒకచోట జనసేన అభ్యర్థి విజయం సాధించారు. వైసీపీకి ఎమ్మెల్యే, ఎంపీలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉండటంతో వైసీపీ బలం 13కు చేరుకుంది. ఒకవేళ జనసేన అభ్యర్థి టీడీపీకి మద్దతు తెలిపితే టీడీపీ బలం కూడా 13కు చేరుకుంటుంది. దీంతో ఇక్కడ టాస్ వేయాల్సి వస్తుంది. మరి జనసేన అభ్యర్థి ఎవరికి మద్దతు పలుకుతారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News