ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే

దాదాపు ఆరుగంటల పాటు సాగిన సమావేశంలో ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. 9,10 షెడ్యూల్ [more]

Update: 2020-01-13 14:58 GMT

దాదాపు ఆరుగంటల పాటు సాగిన సమావేశంలో ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. 9,10 షెడ్యూల్ అంశాలను వీలయినంత త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. గోదావరి జిలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది. గోదావరి జిలాలను వీలయినంత తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంతో కృష్ణా ఆయకట్టుకు తరలించవచ్చని ఇద్దరు సీఎంలు అభిప్రాాయపడ్డారు. సమావేశం నుంచే ఇద్దరు సీఎంలు చీఫ్ సెక్రటరీలతో మాట్లాడారు. వీలయినంత త్వరగా సమావేశం ఏర్పాటు చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు సీఎస్ లను కోరారు.

Tags:    

Similar News