కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నరేంద్ర మోడీ ప్రభుత్వం దీపావళి కానుకగా తీపి కబురు చెప్పింది. 5 శాతం డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది జూలై [more]

Update: 2019-10-09 16:18 GMT

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నరేంద్ర మోడీ ప్రభుత్వం దీపావళి కానుకగా తీపి కబురు చెప్పింది. 5 శాతం డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది జూలై నుంచి పెంచిన డీఏని వర్తింపజేస్తారు. 12 శాతం డీఏను 17 శాతానికి పెంచేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్టు సమావేశానంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు.
ప్రభుత్వం ప్రకటించిన డీఏ పెంపుతో 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని జవదేకర్ చెప్పారు.

 

Tags:    

Similar News