ఆ తుపాకులకు దండం పెట్టాలి

దిశ హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పట్ల దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ఎన్ కౌంటర్ ను సమర్థిస్తూ [more]

Update: 2019-12-06 03:51 GMT

దిశ హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పట్ల దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ఎన్ కౌంటర్ ను సమర్థిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దిశకు తగిన న్యాయం జరిగిందని ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున అభిప్రాయపడ్డారు. మరో సినీనటుడు మంచు మనోజ్ అయితే ఎన్ కౌంటర్ చేసిన బుల్లెట్లు తనకు దాచుకోవాలని ఉందని, ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉందని వ్యాఖ్యానించారు. దిశకు తగిన న్యాయం జరిగిందని ఆమె తల్లిదండ్రులు అభప్రాయపడ్డారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరో బిడ్డకు జరగకూడదని వారు కోరుకుంటున్నారు. ఇక సీపీ సజ్జనార్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. దిశ ఘటనపై దేశం మొత్తం రగిలిపోయిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News