వైసీపీ నేతలకు ధర్నాన వార్నింగ్

ధర్మాన, కింజారపు కుటుంబాలకు లోపాయికారీ ఒప్పందాలున్నాయని వైసీపీ నేతలు కొందరు ప్రచారం చేయడంపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. రెండు కుటుంబాలు ఒకరి ఇంట్లో [more]

Update: 2020-02-23 12:47 GMT

ధర్మాన, కింజారపు కుటుంబాలకు లోపాయికారీ ఒప్పందాలున్నాయని వైసీపీ నేతలు కొందరు ప్రచారం చేయడంపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. రెండు కుటుంబాలు ఒకరి ఇంట్లో పెళ్లికి మరొకరు వస్తారు తప్ప అంతకు మించి రాజకీయంగా ఎటువంటి సంబంధాలుండవని చెప్పారు. ఎవరి పార్టీలు వారివేనని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారం మానుకోవాలని ధర్మాన కృష్ణదాస్ కోరారు. అలాంటి పరిస్థితులే వస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. తప్పుడు ప్రచారాన్ని వైసీపీ నేతలు మానుకోవాలని కోరారు. ఆ ఆలోచనలను తమ బుర్రల్లోంచి తీసేయాలని కోరారు.

Tags:    

Similar News