400 రోజులకు ఉద్యమం… దేవినేని దీక్ష

రాజధాని అమరావతి రైతుల దీక్షలు 400వ రోజుకు చేరుకున్నాయి. ఉద్యమం 400 రోజుకు చేరుకున్న సందర్భంగా టీడీపీ నేత దేవినేని ఉమ దీక్షకు దిగారు. గొల్లపూడి సెంటర్ [more]

Update: 2021-01-20 04:53 GMT

రాజధాని అమరావతి రైతుల దీక్షలు 400వ రోజుకు చేరుకున్నాయి. ఉద్యమం 400 రోజుకు చేరుకున్న సందర్భంగా టీడీపీ నేత దేవినేని ఉమ దీక్షకు దిగారు. గొల్లపూడి సెంటర్ లో దీక్ష చేయాలని దేవినేని ఉమ భావించినా పోలీసులు అందుకు అనుమతించలేదు. ఆయనను నివాసం నుంచి బయటకు రానివ్వలేదు. టీడీపీ కార్యాలయంలో దీక్ష చేసుకుంటామన్నా పోలీసులు అంగీకరించలేదు. దీంతో దేవినేని ఉమ తన ఇంట్లోనే దీక్ష చేపట్టారు. దేవినేని ఉమ దీక్షకు టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర సంఘీభావం ప్రకటించారు.

Tags:    

Similar News