జగన్ మొండోడయితే…?

జగన్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలన్నది తమ పార్టీ అభిమతమన్నారు. అమారావతి జేఏసీతో కలసి అన్ని [more]

Update: 2019-12-25 11:28 GMT

జగన్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలన్నది తమ పార్టీ అభిమతమన్నారు. అమారావతి జేఏసీతో కలసి అన్ని పార్టీలతో నడచి ఆందోళన చేపడతామని దేవినేని ఉమ చెప్పారు. విశాఖలో ఆరు నెలల్లో ఎన్ని వేల ఎకరాల భూముల కొనుగోళ్లు జరిగాయో? చెప్పాలన్నారు. ఐదేళ్ల కంటే ఆరు నెలల్లోనే విశాఖలో ఎక్కువ భూ లావాదేవీలు జరిగాయని తెలిపారు. జగన్ మొండి వైఖరి వల్ల రాష్ట్రం పూర్తిగా వెనకబడి పోయిందన్నారు.

Tags:    

Similar News