మహేష్ బాబునూ అందుకే ఇబ్బంది పెడుతున్నారు

కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఎంపీ గల్లా జయదేవ్ పై ఐటీ, ఈడీ దాడులు జరిగాయని, ఆయన బావమరిది ఇప్పుడు మహేష్ బాబునూ జీఎస్టీ కేసుతో ఇబ్బంది పెడుతున్నారని మంత్రి [more]

Update: 2019-02-20 14:07 GMT

కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఎంపీ గల్లా జయదేవ్ పై ఐటీ, ఈడీ దాడులు జరిగాయని, ఆయన బావమరిది ఇప్పుడు మహేష్ బాబునూ జీఎస్టీ కేసుతో ఇబ్బంది పెడుతున్నారని మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. హైదరాబాద్ లో వ్యాపారాలు ఉన్న టీడీపీ నేతలను బెదిరించే వైసీపీలో చేర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇక, వివిధ దేశాల్లో దాచుకున్న డబ్బులు తీసుకురావడానికే జగన్ లండన్ వెళ్లారని, ఆయన అక్కడ ఏయే దేశాల వారితో మాట్లాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నుంచి పోటీ చేసే ఒక్కో అభ్యర్థి 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ఆరోపించారు.

Tags:    

Similar News