బ్రేకింగ్ : ఈ నెల 30 వరకూ ఏపీలో లాక్ డౌన్.. మినహాయింపులు?

ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ నిబంధనలను సడలించారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ మినహాయింపులను ఇచ్చారు. ఈ మినహాయింపులు ఈ నెల 21వ తేదీ [more]

Update: 2021-06-18 07:24 GMT

ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ నిబంధనలను సడలించారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ మినహాయింపులను ఇచ్చారు. ఈ మినహాయింపులు ఈ నెల 21వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. దుకాణాలు మాత్రం సాయంత్రం ఐదుగంటలకే మూసివేయాల్సి ఉంటుంది. జూన్ 30వ తేదీ వరకూ ఏపీలో లాక్ డౌన్ అమలులో ఉండనుంది. ఇప్పటి వరకూ మధ్యాహ్నం రెండు గంటల వరకే కర్ఫ్యూ సమయంలో మినహాయింపు ఇచ్చారు. కేేసులు ఎక్కువగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం మధ్యాహ్నం రెండు గంటల వరకే మినహాయింపు ఉంటుంది.

Tags:    

Similar News