డీజీపీతో సీఎస్ సుదీర్ఘ భేటీ

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పై డీజీపీ ఠాకూర్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ అయ్యారు. డీజీపీ ఆఫీసుకు స్వయంగా వచ్చిన సీఎస్ డీజీపీతో [more]

Update: 2019-04-11 12:50 GMT

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పై డీజీపీ ఠాకూర్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ అయ్యారు. డీజీపీ ఆఫీసుకు స్వయంగా వచ్చిన సీఎస్ డీజీపీతో రెండు గంటలుగా సుదీర్ఘంగా సమావేశమయ్యారు. సహజంగా అవసరమైన సమయంలో డీజీపీని సీఎస్ తన వద్దకు పిలిపించుకొని వివరణ తీసుకుంటారు. కానీ, సీఎస్ నేరుగా డీజీపీ కార్యాలయానికి వెళ్లి సుదీర్ఘంగా సమావేశమవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. సంప్రదాయాన్ని పక్కన పెట్టిన డీజీపీ వద్దకు సీఎస్ వెళ్లడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుపడుతోంది.

Tags:    

Similar News