సీఎం రమేష్ చంబల్ లోయలో దొంగ

సీపీఐ నారాయణ సంచనల వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చంబల్ లోయలో దొంగలాంటి వాడన్నారు. బీజేపీలో చేరగానే సీఎం రమేష్ పునీతుడవుతాడా? అని ప్రశ్నించారు. [more]

Update: 2019-11-24 06:07 GMT

సీపీఐ నారాయణ సంచనల వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చంబల్ లోయలో దొంగలాంటి వాడన్నారు. బీజేపీలో చేరగానే సీఎం రమేష్ పునీతుడవుతాడా? అని ప్రశ్నించారు. సీఎం రమేష్ తన కుమారుడి నిశ్చితార్తం కోసం విమానంలో వేలాది మందిని తరలిస్తున్నారన్నారు. దుబాయికి దోచుకున్న డబ్బుతోనే అందరినీ తీసుకువెళుతున్నాడన్నారు. సీఎం రమేష్, సుజనా చౌదరి కోవర్టులుగా మారి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. మంత్రి కొడాలి నాని సినిమా హాళ్ల వద్ద బ్లాక్ టిక్కెట్లు అమ్ముకునే రకమని, అలాంటి వాళ్లు మంత్రి అయితే తిట్లు కాక పురాణం విన్పిస్తుందా అని ఎద్దేవా చేశారు. జగన్ కు దమ్ముంటే విశాఖ భూకుంభకోణంలో సిట్ రిపోర్ట్ ను బయట పెట్టాలన్నారు.

Tags:    

Similar News