తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు… మరణాలు కూడా

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా 41 కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. నలుగురు మరణించారు. దీంతో తెలంగాణలో కరోనా కారణంగా మృతి చెందిన [more]

Update: 2020-05-25 06:39 GMT

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా 41 కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. నలుగురు మరణించారు. దీంతో తెలంగాణలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 53కు చేరుకుంది. తాజాగా నమోదయిన 41 కేసుల్లో హైదరాబాద్ లోనే 23 కేసులున్నాయి. వలస కార్మికులు 11 మంది వరకూ ఉన్నారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1854కు చేరుకుంది. లాక్ డౌన్ నిబంధలను సడలించిన నాటి నుంచే తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతుందని అధికారులు సయితం అంగీకరిస్తున్నారు.

Tags:    

Similar News