2న మంత్రివర్గ సమావేశం.. అందులోనే లాక్ డౌన్ పై నిర్ణయం

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 861 కరోనా కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. దీంతో [more]

Update: 2020-06-30 02:50 GMT

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 861 కరోనా కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజటివ్ కేసుల సంఖ్య 15,94కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణో 5,582 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 9,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ తెలంగాణలో కరోనా కారణంగా 253 మంది మృతి చెందారు. హైదరాబాద్ లో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నెల 2న కేసీఆర్ మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హైదరాబాద్ లో లాక్ డౌన్ ను విధించే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News