ఏపీ ఆలయాల్లో కఠిన ఆంక్షలు

ఆంధ్రప్రదేశ్ లో ఆలయాల్లో కరోనా ఆంక్షలు విధిస్తున్నారు. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ఆలయ అధికారులు, సిబ్బందిలో కూడా ఆందోళన మొదలయింది. దీంతో అనేక ఆలయాల్లో ఆంక్షలను విధించారు. [more]

Update: 2021-04-24 01:26 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఆలయాల్లో కరోనా ఆంక్షలు విధిస్తున్నారు. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ఆలయ అధికారులు, సిబ్బందిలో కూడా ఆందోళన మొదలయింది. దీంతో అనేక ఆలయాల్లో ఆంక్షలను విధించారు. గర్భిణులు, బాలింతలు, పదేళ్ల లోపు చిన్నారులకు దర్శనం లేదని అధికారులు చెబుతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి, ద్వారకా తిరుమల, శ్రీశైలం వంటి ఆలయాల్లో ఈ ఆంక్షలను విధించారు. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే ఆలయాలు భక్తులు లేక బోసిపోతున్నాయి

Tags:    

Similar News